పాక్తో భారత్ తొలి పోరు
ABN, Publish Date - Jun 19 , 2025 | 03:35 AM
మహిళల టీ20 వరల్డ్క్ప-2026లో తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఇంగ్లండ్లో వచ్చే ఏడాది జూన్ 12 నుంచి జూలై 5 వరకు...
మహిళల టీ20 వరల్డ్కప్-2026 షెడ్యూల్ విడుదల
దుబాయ్: మహిళల టీ20 వరల్డ్క్ప-2026లో తమ తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఇంగ్లండ్లో వచ్చే ఏడాది జూన్ 12 నుంచి జూలై 5 వరకు.. 24 రోజులపాటు జరిగే పొట్టికప్ షెడ్యూల్ను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. టోర్నీలో పాల్గొనే 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్తోపాటు రెండు క్వాలిఫయర్ జట్లు.. గ్రూప్-2లో వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంకతోపాటు రెండు క్వాలిఫయర్ టీమ్లు ఆడనున్నాయి. జూన్ 12న ఎడ్జ్బాస్టన్లో జరిగే ఆరంభ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లండ్తో శ్రీలంక తలపడనుండగా.. ఇదే వేదికపై 14న జరిగే పోరులో పాక్తో భారత్ ఆడనుంది. గ్రూప్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ్సకు అర్హత సాధిస్తాయి. జూన్ 30, జూలై 2న సెమీఫైనల్స్.. జూలై 5న లార్డ్స్లో టైటిల్ ఫైట్ జరగనున్నాయి.
ఇవీ చదవండి:
నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి..
18 నంబర్ జెర్సీ.. సిరీస్లో ఇదే హైలైట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 19 , 2025 | 03:35 AM