ఇంగ్లండ్ ఎతో మ్యాచ్ డ్రా
ABN, Publish Date - Jun 03 , 2025 | 05:06 AM
భారత్ ‘ఎ’, ఇంగ్లండ్ ‘ఎ’ జట్ల మధ్య జరిగిన నాలుగు రోజుల తొలి అనధికార టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి రోజు సోమవారం ఆట ముగిసేసరికి...
భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్ 241/2
కాంటర్బరీ: భారత్ ‘ఎ’, ఇంగ్లండ్ ‘ఎ’ జట్ల మధ్య జరిగిన నాలుగు రోజుల తొలి అనధికార టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి రోజు సోమవారం ఆట ముగిసేసరికి భారత్ రెండో ఇన్నింగ్స్లో 241/2 స్కోరు చేసింది. అభిమన్యు (68), జైస్వాల్ (64), జురెల్ (53 నాటౌట్), నితీశ్ (52 నాటౌట్) అర్ధసెంచరీలు సాధించారు. అంతకుముందు ఇంగ్లండ్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 587 రన్స్కు ఆలౌటైంది. జమన్ (41) రాణించాడు. ముకేశ్కు 3, శార్దూల్కు 2 వికెట్లు దక్కాయి. భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్లో 557 రన్స్ చేసింది.
Updated Date - Jun 03 , 2025 | 05:06 AM