క్రికెటర్లకు పెయిడ్ ఫ్యాన్స్ ఉన్నారు
ABN, Publish Date - May 19 , 2025 | 03:54 AM
కొందరు క్రికెటర్లకు పెయిడ్ ఫ్యాన్స్ ఉన్నారని భారత జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ క్రికెటర్లు ఎవరో అతడు వెల్లడించలేదు...
న్యూఢిల్లీ: కొందరు క్రికెటర్లకు పెయిడ్ ఫ్యాన్స్ ఉన్నారని భారత జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ క్రికెటర్లు ఎవరో అతడు వెల్లడించలేదు. ఓ క్రీడా చానెల్ చర్చలో హర్భజన్ మాట్లాడుతూ ‘ఆడినంత కాలం ధోనీ ఐపీఎల్లో కొనసాగాలి. మహీ ఇంకా ఐపీఎల్ ఆడాలని అతడి ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. వారంతా ధోనీకి నిజమైన అభిమానులు. అయితే సోషల్ మీడియాలో కొందరు ఫ్యాన్స్ ఉంటారు. వారు మాత్రం డబ్బులు తీసుకొనే అభిమానులు. వారిని వదిలేయండి. వారిపై చర్చ సాగిస్తే దానికి అంతూ..దరీ ఉండదు’ అని వ్యాఖ్యానించాడు. అదే చర్చలో పాల్గొన్న మరో భారత ఆటగాడు ఆకాశ్ చోప్రా కల్పించుకొని ‘భజ్జీ భాయ్..మరీ అలా నిజాలు చెప్పకు’ అని నవ్వుతూ అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండవ..
Updated Date - May 19 , 2025 | 03:54 AM