బాస్ క్వార్టర్స్లో బోపన్న జోడీ
ABN, Publish Date - Jun 12 , 2025 | 04:59 AM
ఏటీపీ 250 బాస్ ఓపెన్ టోర్నమెంట్లో భారత టెన్నిస్ వెటరన్ స్టార్ రోహన్ బోపన్న డబుల్స్లో క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లగా.. శ్రీరామ్ బాలాజీ, యుకీ భాంబ్రీ టోర్నీ నుంచి నిష్క్రమించారు...
‘బాస్’ క్వార్టర్స్లో బోపన్న జోడీ
స్టట్గార్ట్ (జర్మనీ): ఏటీపీ 250 బాస్ ఓపెన్ టోర్నమెంట్లో భారత టెన్నిస్ వెటరన్ స్టార్ రోహన్ బోపన్న డబుల్స్లో క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లగా.. శ్రీరామ్ బాలాజీ, యుకీ భాంబ్రీ టోర్నీ నుంచి నిష్క్రమించారు. బోపన్న/శాండర్ గిల్లె (బెల్జియం) ద్వయం 6-3, 5-7, 11-9తో స్థానిక జంట జాకబ్/మార్క్పై గెలిచింది. మిగతా మ్యాచుల్లో యుకీ/రాబర్ట్ జంట 6-7(5), 6-7(5)తో గొంజాలెజ్/ఆస్టిన్ జోడీ చేతిలో, బాలాజీ/మిగెల్ (మెక్సికో) ద్వయం 7-6(5), 3-6, 5-10తో ఫ్రాన్స్ జంట సాడియో డౌంబియా/ఫాబియెన్ రెబోల్ చేతిలో పరాజయం పాలయ్యారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 12 , 2025 | 04:59 AM