ఒక్క సెషన్లోనే కూల్చారు
ABN, Publish Date - Jun 29 , 2025 | 03:30 AM
వెస్టిండీ్సతో జరిగిన తొలి టెస్టును ఆస్ట్రేలియా మూడు రోజుల్లోనే ముగించింది. 301 పరుగుల లక్ష్య ఛేదన కోసం శుక్రవారం చివరి సెషన్లో విండీస్ రెండో ఇన్నింగ్స్ను...
విండీస్ చిత్తు
159 రన్స్తో ఆసీస్ గెలుపు
బ్రిడ్జిటౌన్: వెస్టిండీ్సతో జరిగిన తొలి టెస్టును ఆస్ట్రేలియా మూడు రోజుల్లోనే ముగించింది. 301 పరుగుల లక్ష్య ఛేదన కోసం శుక్రవారం చివరి సెషన్లో విండీస్ రెండో ఇన్నింగ్స్ను ఆరంభించింది. అయితే పేసర్ హాజెల్వుడ్ (5/43) ధాటికి కేవలం 141 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆసీస్ 159 పరుగులతో భారీ విజయం దక్కించుకుంది. మూడు టెస్టుల సిరీ్సలో 1-0తో ఆధిక్యం అందుకుంది. షామర్ జోసెఫ్ (44), గ్రీవ్స్ (38 నాటౌట్) రాణించారు. అంతకుముందు ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 310 పరుగులు చేసింది. షామర్కు 5 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 180, విండీస్ 190 రన్స్ చేశాయి. మరోవైపు వరల్డ్ టెస్టు చాంపియన్షి్ప చరిత్రలో పది సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాధించిన ఏకైక బ్యాటర్గా ట్రావిస్ హెడ్ రికార్డు నెలకొల్పాడు.
ఇవీ చదవండి:
డేంజరస్ సెలబ్రేషన్.. పంత్ పరిస్థితేంటి..
రొనాల్డో సీక్రెట్ బయటపెట్టిన సైంటిస్ట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 29 , 2025 | 03:30 AM