ఆపరేషన్ సింధూర్
ABN, Publish Date - May 07, 2025 | 08:49 AM
పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సైన్యం మెరుపు దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేసి పాక్ ఆక్రమిత కశ్మీర్తోపాటు పాకిస్థాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను, వారి సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేసినట్లు తెలిసింది. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు జరపడం విశేషం. ఈ దాడులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది.
Updated Date - May 07, 2025 | 08:49 AM