చార్మినార్ వద్ద ప్రపంచ అందాల భామల హెరిటేజ్ వాక్..
ABN, Publish Date - May 13 , 2025 | 08:07 PM
చార్మినార్ సందర్శించిన 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు అక్కడ హెరిటేజ్ వాక్ చేశారు.
మిస్ వరల్డ్-2025 పోటీదారులు మంగళవారం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు.
తెలంగాణ పర్యాటక శాఖ బస్సుల్లో వచ్చిన ప్రపంచ సుందరీమణులు హైదరాబాద్ పాత బస్తీలోనూ సందడి చేశారు.
చార్మినార్ సందర్శించిన 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు అక్కడ హెరిటేజ్ వాక్ చేశారు.
హెరిటేజ్ వాక్ అనంతరం అందాలభామలు లాడ్ బజార్లో కలియతిరిగి షాపింగ్ చేశారు.
ఈ మేరకు అధికారులు చార్మినార్ పరిసర ప్రాంతాలను సర్వాంగసుందరంగా అలంకరించారు.
తెలంగాణ వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ మిస్ వరల్డ్ హెరిటేజ్ వాక్ చేపట్టింది.
ఈ సందర్భంగా మార్ఫా వాయిద్యాలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కు స్థానికులు ఘనస్వాగతం పలికారు.
చార్మినార్ చుట్టూ తిరిగి సుందరీమణులు అక్కడి ప్రదేశాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు.
చార్మినార్ చుడీ బజార్లో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాలహారాలు అలంకరణ వస్తువులను కొనుగోలు చేశారు.
మరోవైపు మిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం ఓరుగల్లు పర్యటనకు రానున్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.
Updated Date - May 13 , 2025 | 08:07 PM