Exporting Inflation: వామ్మో.. భారత్కు ద్రవోల్బణాన్ని ఎగుమతి చేస్తున్న అమెరికా
ABN, Publish Date - Oct 02 , 2025 | 10:48 PM
అమెరికా తన అవసరాలకు తగ్గట్టు డాలర్లను ముద్రిస్తూ వర్ధమాన దేశాలకు ద్రవ్యోల్బణం ఎగుమతి చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అనుగూణంగా పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలని భారతీయులకు సూచిస్తున్నారు.
అమెరికా భారత్కు ద్రవ్యోల్బణాన్ని ఎగుమతి చేస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
తన అవసరాలకు అనుగూణంగా డాలర్లను ముద్రించి చెలామణిలోకి తేవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.
ప్రస్తుతం చెలామణిలో ఉన్న 60 శాతం డాలర్ నోట్లు గత ఐదేళ్లల్లో ముద్రించినవే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డాలర్ లభ్యత పెరిగే కొద్దీ వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ ప్రభావం మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాలపైనే అధికంగా ఉంటుంది.
డాలర్ విలువ అదే విధంగా కొనసాగుతుండగా భారత్ వంటి వర్ధమాన దేశాల కరెన్సీ మాత్రం వేగంగా పతనమై ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమవుతోంది.
గత ఐదేళ్లల్లో డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 20 శాతం పతనమైంది.
ఇది వర్ధమాన దేశాలపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. అమెరికా నుంచి ఇతర దేశాలకు ద్రవ్యోల్బణం బదిలీ అవుతోంది.
ఇక అమెరికా ప్రభుత్వం డాలర్ విలువను, క్రిప్టోకరెన్సీలకు అనుసంధానం చేస్తే ద్రవ్యోల్బణం ఎగుమతి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే స్టాక్స్లో భారతీయులు పెట్టుబడులు పెట్టి తమ భవిష్యత్తుకు భద్రత సాధించాలని నిపుణులు చెబుతున్నారు.
Updated Date - Oct 02 , 2025 | 10:48 PM