Satya Sai - President: లోక కళ్యాణం కోసం సత్యసాయి పని చేశారు : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ABN, Publish Date - Nov 22 , 2025 | 05:47 PM
పుట్టపర్తి, నవంబర్ 22: సత్యం, మంచి వ్యక్తిత్వం, శాంతి, ప్రేమ వంటిని పాటించాలని సత్యసాయి బాబా నిరంతరం బోధించేవారని, లోక కళ్యాణం కోసం బాబా పని చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు జాతి నిర్మాణం కోసం పని చేస్తోందని తెలిపారు.
పుట్టపర్తిలో జరుగుతోన్న సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా మహాద్భాగ్యం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మానన సేవే మాధవ సేవ అని బాబా భావించేవారు
సమాజానికి సేవలందించిన మహానుభావుల్లో సత్యసాయి బాబా అగ్రభాగాన ఉన్నారు
చాలామంది సత్యసాయి భక్తులు దేశ, విదేశాల్లో ఉన్న పేద వారికి సేవలందిస్తున్నారు
1969 నుంచే మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు..నేషన్ ఫస్ట్ అనే విధానంలో సత్యసాయి బాబా సేవలందించారు.. దీన్ని అందరూ పాటించాలి
బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన స్పూర్తితో పని చేస్తామని సంకల్పం తీసుకోవాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అంతకు ముందు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, అధికారుల ఘన స్వాగతం
Updated Date - Nov 22 , 2025 | 05:57 PM