విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి నారా భువనేశ్వరి శంకుస్థాపన..
ABN, Publish Date - Mar 06 , 2025 | 05:50 PM
విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు భవన్ శంకుస్థాపన గురువారం ఉదయం జరిగింది. కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులకు విద్య, వైద్య సాయానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరుగుతాయి.
విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు భవన్ శంకుస్థాపన గురువారం ఉదయం జరిగింది.
ఈ కార్యక్రమానికి నారా భువనేశ్వరి హాజరయ్యారు.
ఈ సందర్భంగా భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.
దాదాపు 600 గజాల స్థలాన్ని కొద్దికాలం కిందట ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
ఇప్పటికే హైదరాబాద్ నుంచి ట్రస్టు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
భవనం పూర్తయితే ట్రస్ట్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి. ముఖ్యంగా విద్య, వైద్య సంబంధిత కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి.
కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అందుబాటులోకి వస్తే పేద విద్యార్థులకు విద్య, వైద్య సాయానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరుగుతాయి.
ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 06 , 2025 | 05:50 PM