Home » Nara Bhuvaneswari
హైదరాబాద్లోని తమ నివాసానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ భావోద్వేగంగా స్పందించారు. సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో పోస్టు చేస్తూ ప్రధాని పర్యటనను ప్రత్యేకమైన సందర్భంగా వారు అభివర్ణించారు.
మదర్స్ డే నేడు. ఈ నేపథ్యంలో తన తల్లి నారా భువనేశ్వరికి ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి, టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం తన ఎక్స్ ఖాతా వేదికగా నారా లోకేశ్ స్పందించారు.
సీఎం చంద్రబాబు నాయుడు తన 76వ పుట్టినరోజు సందర్భంగా భార్య నారా భువనేశ్వరతో కలిసి విజయవాడలోని పటమట ప్రాంతంలో ఉన్న అన్న క్యాంటీన్ను సందర్శించారు. ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి అన్న క్యాంటీన్లో అల్పాహారం తీసుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు 76వ జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి.. అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల చెక్ను విరాళంగా అందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం రేపు. ఈ నేపథ్యంలో అన్న క్యాంటీన్లకు ఆయన సతీమణి భువనేశ్వరి రూ. 76 లక్షల విరాళాన్ని అందజేశారు.
కుప్పంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి కట్టుమిషన్లు, తోపుడు బండ్లు, వినికిడి మిషన్లను అందజేశారు.
‘మీ బాధ్యత మాది. అధైర్య పడకండి’ అంటూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐటీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రవికుమార్ కుటుంబానికి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు.
‘పేదల ఆకలి తీర్చడమే అన్న ఎన్టీఆర్ ఆశయం. కూడు.. గూడు.. గుడ్డ నినాదంతో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇప్పుడా పథకాలు దేశమంతా అమలవుతున్నాయి.
‘చంద్రబాబు మీద నమ్మకంతో కుప్పంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. మన బిడ్డల భవిష్యత్తుకు పరిశ్రమలు దోహదపడతాయి. అందుకు అడ్డుపడకండి. స్వర్ణ కుప్పం సాకారానికి సహకరించండి’ అని కుప్పం ప్రజలకు నారా భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు.
కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి బిజీబిజీగా ఉన్నారు. మూడో రోజు పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొననున్నారు.