Home » Nara Bhuvaneswari
ఎన్టీఆర్ ట్రస్ట్.. సేవలకు మారు పేరు. ఈ ట్రస్ట్ నేటితో 30వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరితో పాటు ఆమె బృందానికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని సినీ నిర్మాత బండ్ల గణేశ్ కుటుంబసమేతంగా వెళ్లి కలిశారు. చంద్రబాబుపై బండ్ల గణేశ్ అభిమానం మరువలేనిదని ఈ సందర్భంగా భువనేశ్వరి తెలిపారు..
నేడు దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయన కుమార్తె నారా భువనేశ్వరి హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. మంగళవారం ప్రజలతో కలిసి అత్యంత సాదాసీదాగా గడిపారు..
భారత డెయిరీ రంగ అభివృద్ధిలో విశిష్ట సేవలకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ఛైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి ప్రతిష్ఠాత్మక 'అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు-2025'ను సౌత్జోన్ ప్రదానం చేసింది.
విద్యార్థులు ఆంగ్లంలో ప్రతిభ కనబర్చేలా అధ్యాపకులు చూడాలని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి సూచించారు. తానూ నిమ్మకూరు రావడం స్వీట్ మెమరీ అని.. ఇది మా తాత లక్ష్మయ్య ఊరని చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు సెలవులు వస్తే అమ్మ, తమను నిమ్మకూరు పంపించేదని అన్నారు.
నిమ్మకూరులో నారా భువనేశ్వరి పర్యటించారు. విద్యార్థులతో మాట్లాడిన భువనమ్మ.. నిమ్మకూరుకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆనందం వ్యక్తం చేశారు.
హిందూపురం వస్తే.. తన పుట్టింటికి వచ్చినట్లుగా ఉంటుందని రాష్ట్రమంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ సంస్థల ఈడీ నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు, విద్యర్థులు బ్రాహ్మణికి ఘనస్వాగతం పలికారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబానాయుడు సతీమణి భువనేశ్వరి తమిళంలో మాట్లాడారు. ఎలారిక్కిం సౌగ్యమా... అంటూ పలకరించారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. అయితే.. అక్కడికి విచ్చేసిన వారితో తమిళంలో మాట్లాడారు.