CM Chandrababu: నారావారిపల్లెలో అభివృద్ధి పనుల్లో బిజిగా సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jan 14 , 2025 | 08:13 AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో బిజీబిజీగా గడిపారు. ఓవైపు కుటుంబ సభ్యులతో కలసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూనే.. మరో వైపు సొంతూరి అభివృద్ధికి పలు శంకుస్థాపనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం తన స్వగ్రామమైన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో బిజీబిజీగా గడిపారు.
ఓవైపు కుటుంబ సభ్యులతో కలసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటూనే.. మరో వైపు సొంతూరి అభివృద్ధికి పలు శంకుస్థాపనలు చేశారు.
అటు సంబరాల్లో, ఇటు అభివృద్ధి కార్యకలాపాలతో క్షణం తీరిక లేకుండా ఉన్నప్పటికీ చంద్రబాబు తన కోసం వచ్చిన సామాన్య ప్రజల నుంచీ అర్జీలు స్వీకరించారు.
కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, డీఐజీ శేముషీ బాజ్పాయ్, మాజీ మంత్రి అమరనాథ్రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గాలి భానుప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె అభివృద్ధిపై చంద్రబాబు దృష్టి సారించారు.
అందులో భాగంగా రేవాండ్స్ కంపెనీ ద్వారా నారావారిపల్లె రైతులు బలరాం నాయుడు, జ్యోతిలకు డ్రిప్ పరికరాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఏ ఊరి పరిసరాల్లోని మూడు సచివాలయాల పరిధిలో అర్హులైన రైతులను ఏపీ సూక్ష్మ సాగునీటి పథకం (ఏపీఎంఐపీ) పరిధిలోకి చేర్చాలని కలెక్టర్ వెంకటేశ్వర్ను ఆదేశించారు.
అలాగే రూ.4.27 కోట్లతో 33 కేవీ ఇన్డోర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
సబ్ స్టేషన్ నిర్మాణం త్వరగా పూర్తి చేయడంతో పాటు నారావారిపల్లె పరిధిలో 2 వేల ఇళ్లకు సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ను, డిస్కమ్ సీఎండీ సంతోషరావును సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Updated Date - Jan 14 , 2025 | 08:16 AM