NRI: బేసింగ్స్టోక్లో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం
ABN, Publish Date - Sep 20 , 2025 | 10:00 PM
తెలుగు అసోసియేషన్ ఆఫ్ బేసింగ్స్టోక్ ఆధ్వర్యంలో బేసింగ్స్టోక్లో శ్రీ వేంకటేశ్వర కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 1,000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు
ఇంటర్నెట్ డెస్క్: శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య ఆశీస్సులతో, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మార్గదర్శకత్వంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) సహకారంతో, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) యూరప్లోని వివిధ నగరాల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది.
ఈ క్రమంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ బేసింగ్స్టోక్ ఆధ్వర్యంలో బేసింగ్స్టోక్లో శ్రీ వేంకటేశ్వర కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 1,000 మందికి పైగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు
ఈ కార్యక్రమం ముఖ్యాంశాలు:
* తిరుమల నుండి వచ్చిన పండితులైన పూజారులు, వేద పండితులు పురాతన మంత్రాలు, ఆచారాల ద్వారా దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ పవిత్ర కల్యాణాన్ని పూర్తి సాంప్రదాయ వైభవంతో నిర్వహించారు.
* భక్తులకు దేవదేవుడి ఆశీర్వాదాలను అందించే టీటీడీ లడ్డూ ప్రసాదం, తీర్థం, అక్షింతలు లభించాయి.
* కల్యాణ మహోత్సవానికి హాజరైన వారందరూ ఆధ్యాత్మిక వాతావరణంలో స్వామి వారి నామస్మరణతో తరించారు.
ఈ కార్యక్రమం తెలుగు ప్రవాసుల ఐక్యత, భక్తి, సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనంగా నిలిచింది. ఇది ఆధ్యాత్మిక సంతృప్తికి అవకాశాన్ని మాత్రమే కాకుండా సనాతన ధర్మం, అనాదిగా వస్తున్న సంప్రదాయాలు దైవిక వారసత్వాన్ని కూడా గుర్తు చేసింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కలిసి వచ్చిన స్వచ్ఛంద సేవకులు, భక్తులకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరినీ నడిపిస్తూ, రక్షిస్తూనే ఉంటాయని అన్నారు.
యునైటెడ్ కింగ్డమ్కు APNRT సమన్వయకర్తగా పనిచేస్తున్న సురేష్ కోరం, యూకేలో కల్యాణాలను విజయవంతంగా సమన్వయం చేస్తూ కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో అరుణ్ ముమ్మనేని, శ్రీని వావిలాల, అరుణ్ పడకంటి తదితరులు ఒక టీమ్గా ఏర్పడి అద్భుతమైన సమన్వయంతో ఈ వేడుకను విజయవంతం చేశారు.
Updated Date - Sep 20 , 2025 | 10:17 PM