ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MR Srinivasan: అణు శక్తి కమిషన్‌ మాజీ చైర్మన్‌ శ్రీనివాసన్‌ కన్నుమూత

ABN, Publish Date - May 21 , 2025 | 03:43 AM

ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త, పద్మవిభూషణ్‌ ఎం.ఆర్‌. శ్రీనివాసన్‌ మంగళవారం ఉదగమండలంలో కన్నుమూశారు. భారత అణు శక్తి అభివృద్ధికి ఆయన ఎనలేని సేవలందించారు.

చెన్నై, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ అణు శాస్త్రవేత్త, అణు శక్తి కమిషన్‌ మాజీ చైర్మన్‌ పద్మవిభూషణ్‌ ఎంఆర్‌. శ్రీనివాసన్‌(95) తమిళనాడులోని ఉదగమండలం(ఊటీ)లో మంగళవారం కన్నుమూశారు. బెంగళూరులో జన్మించిన శ్రీనివాసన్‌ 1955లో భారత అణు శక్తి విభాగంలో చేరారు. దేశంలో తొలి అణు పరిశోధన రియాక్టర్‌ అప్సర అభివృద్ధిలో ప్రముఖ శాస్త్రవేత్త హోమీ బాబాతో కలిసి పనిచేశారు. 1974లో అణుశక్తి శాఖలో అణు విద్యుత్తు ప్రాజెక్టుల ఇంజనీరింగ్‌ విభాగానికి డైరెక్టర్‌ అయ్యారు. 1984లో న్యూక్లియర్‌ పవర్‌ బోర్డు చైర్మన్‌ అయ్యారు. ఆ సమయంలో దేశ వ్యాప్తంగా పలు అణు విద్యుత్తు ప్రాజెక్టుల రూపకల్పన, అభివృద్ధి, నిర్వహణలో కీలక పాత్ర వహించారు. శ్రీనివాసన్‌ నాయకత్వంలో దేశంలో 18 అణు విద్యుత్తు యూనిట్లకు రూపకల్పన జరగడం విశేషం. ప్రస్తుతం వాటిలో ఏడు పని చేస్తున్నాయి. 1987లో అణు శక్తి కమిషన్‌ చైర్మన్‌గా, అలాగే అణు శక్తి శాఖకు కార్యదర్శిగా నియమితులయ్యారు. దేశ అణు శక్తి కార్యక్రమానికి శ్రీనివాసన్‌ చేసిన సేవలకు గుర్తింపుగా 2015లో కేంద్రం పద్మ విభూషణ్‌ అవార్డు ప్రదానం చేసింది. ఆయన మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ప్రగాఢ సంతాపం ప్రకటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News


Updated Date - May 21 , 2025 | 03:43 AM