Law Commission Chairman: లా కమిషన్ చీఫ్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి
ABN, Publish Date - Apr 16 , 2025 | 07:24 AM
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి 23వ లా కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ప్రధాని మోదీ ఆమోదంతో ఈ నియామకాన్ని న్యాయ శాఖ ప్రకటించింది.
ప్రధాని మోదీ ఆమోదం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి 23వ లా కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని న్యాయ శాఖ మంగళవారం ఎక్స్ ద్వారా తెలిపింది. ఆయన నియామకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించారని పేర్కొంది. పూర్తికాల సభ్యులుగా న్యాయవాది హితేష్ జైన్, ప్రొఫెసర్ డి.పి.వర్మ నియమితులయ్యారు. ప్రొఫెసర్ వర్మ గత లా కమిషన్లోనూ సభ్యుడిగా పనిచేశారు. వారు బాధ్యతలు స్వీకరించారని న్యాయ శాఖ తెలిపింది. ఈ ముగ్గురి పేర్లను న్యాయ వ్యవహారాల విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదించింది.
Updated Date - Apr 16 , 2025 | 07:24 AM