ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vehicle Accident in Kashmir: కశ్మీర్‌లో వాహనం బోల్తా.. రాష్ట్ర జవాన్‌ మృతి

ABN, Publish Date - Aug 12 , 2025 | 06:50 AM

జమ్మూకశ్మీర్‌లో ఓ సైనిక వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఖమ్మం జిల్లాకు చెందిన జవాను మృతి చెందాడు.

కారేపల్లి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): జమ్మూకశ్మీర్‌లో ఓ సైనిక వాహనం అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో ఖమ్మం జిల్లాకు చెందిన జవాను మృతి చెందాడు. కారేపల్లి మండలం సూర్యతండాకు చెందిన బానోత్‌ అనిల్‌ (30) సోమవారం గస్తీ నిర్వహించే ప్రాంతానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు ఆర్మీ అధికారులు అనిల్‌ కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అనిల్‌కు భార్య రేణుక, ఎనిమిది నెలల వయసున్న కుమారుడు ఉన్నారు. ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చిన అనిల్‌ 20 రోజుల కిత్రమే తిరిగి విధుల్లో చేరాడు. ఈ నెల 10వ తేదీ ఆదివారం అనిల్‌ పుట్టిన రోజు కాగా.. ఆ మరునాడే మృతి చెందడం బాధాకరం. అనిల్‌ మృతదేహాన్ని మంగళవారం విజయవాడ విమానాశ్రయానికి తీసుకురానన్నుట్లు సమాచారం.

Updated Date - Aug 12 , 2025 | 06:50 AM