Indus Waters Treaty: భారత్ దెబ్బకు పాక్లో ఎండిన చీనాబ్
ABN, Publish Date - May 01 , 2025 | 05:11 AM
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంతో పాక్లోని చీనాబ్ నది ఎండిపోయింది. శాటిలైట్ చిత్రాల ప్రకారం, ఏప్రిల్ 29 నాటికి చీనాబ్ ప్రవాహం పూర్తిగా ఆగిపోయినట్టు తెలుస్తోంది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్గా శాటిలైట్ చిత్రాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడంతో దాయాది దేశం పాకిస్థాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. రోజుల వ్యవధిలోనే పాక్లోని సియాల్కోట్లో ప్రవహించే చీనాబ్ నది ఎండిపోయింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. పాక్కు జీవనాడి అయిన సింధు జలాలను కట్టడి చేయడంతో.. ఏప్రిల్ 29వ తేదీ కల్లా పొరుగు దేశంలో ప్రధాన నది అయిన చీనాబ్లో ప్రవాహాలు పూర్తిగా కనుమరగయ్యాయి.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..
Updated Date - May 01 , 2025 | 05:11 AM