ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

China Supports Pakistan: పాకిస్థాన్‌కు అండగా ఉంటాం

ABN, Publish Date - Apr 28 , 2025 | 04:39 AM

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ, పాక్‌ భద్రతపై చైనా ఆందోళనలను అర్థం చేసుకుంటున్నట్లు పేర్కొంది. పహల్గామ్ దాడిపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని పాకిస్థాన్‌ కోరినట్లు చైనా స్పష్టం చేసింది.

భారత్‌ చర్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం: చైనా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 27: పహల్గాం ఉగ్రదాడి, భారత్‌ చేపడుతున్న చర్యలను తాము క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని.. ఈ అంశంలో పాకిస్థాన్‌కు అండగా ఉంటామని చైనా పేర్కొంది. పాక్‌ ఉప ప్రధాని మహమ్మద్‌ ఇషాక్‌తో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి ఈ మేరకు భరోసా ఇచ్చారు. ‘‘చైనా మిత్రదేశం, వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్థాన్‌ భద్రత గురించిన ఆందోళనను మేం అర్థం చేసుకోగలం. పాక్‌ తన సార్వభౌమత్వాన్ని నిలుపుకోవడంలో అండగా ఉంటాం. పహల్గాం దాడిపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలన్న పాక్‌ డిమాండ్‌కు మద్దతు ఇస్తాం’’ అని పేర్కొన్నారు. మరోవైపు, పహల్గాం ఉగ్రదాడి, పాకిస్థాన్‌ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ భారత్‌ కఠిన చర్యలు చేపట్టడంతో.. ఈ అంశాన్ని వివాదాస్పదం చేసేందుకు పాకిస్థాన్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పహల్గాం ఉగ్రదాడి అంశంలో రష్యా, చైనా జోక్యం చేసుకోవాలని, భారత్‌ చెబుతున్నది నిజమా, అబద్ధమా తేల్చాలని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ పేర్కొన్నారు. రష్యా అధికారిక వార్తా సంస్థ ‘ఆర్‌ఐఏ నొవొస్తి’తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కశ్మీర్‌లో జరిగిన ఘటన కుట్రదారులు ఎవరో తేలుద్దాం. రష్యాగానీ, చైనాగానీ, యూరోపియన్‌ దేశాలుగానీ ఈ విషయంలో చాలా కీలక పాత్ర పోషించగలవని అనుకుంటున్నాను. ఆ దేశాలు ఒక విచారణ బృందాన్ని నియమించి.. భారత్‌, మోదీ నిజం చెప్తున్నారా, అబద్ధం చెబుతున్నారా అన్నదానిపై దర్యాప్తు చేయాలి. అసలు విషయం ఏమిటో అంతర్జాతీయ బృందంతో తేల్చాలి..’’ అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా

Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు

Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా

Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 28 , 2025 | 04:55 AM