EPF: ఈపీఎఫ్పై 8.25 శాతం వడ్డీ రేటుకు కేంద్రం ఆమోదం
ABN, Publish Date - May 25 , 2025 | 04:03 AM
2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎ్ఫపై 8.25% వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ వడ్డీ రేటుతో 7 కోట్లకుపైగా ఈపీఎ్ఫవో సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమకానుంది.
న్యూఢిల్లీ, మే 24: ఈపీఎ్ఫపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని ఫిబ్రవరి 28న ఈపీఎ్ఫవో నిర్ణయించింది. దీనిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపారు. దీనికి ఆ శాఖ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని గురువారం ఈపీఎ్ఫవోకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పంపినట్టు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఆమోదం తెలిపిన వడ్డీ రేటు ప్రకారం.. వడ్డీ మొత్తాన్ని 7కోట్లకు పైగా ఈపీఎ్ఫవో చందాదారుల ఖాతాల్లో జమచేయనున్నారు.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్ఫోన్లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..
Updated Date - May 25 , 2025 | 04:04 AM