Bomb Strike: పెన్షన్ కోసం లైన్లో ఉన్న వృద్ధులపై రష్యా గ్లైడ్ బాంబు
ABN, Publish Date - Sep 10 , 2025 | 03:28 AM
ఉక్రెయిన్లో ఘోరం జరిగింది. మంగళవారం రష్యా ప్రయోగించిన గ్లైడ్ బాంబ్ ఒకటి డోనెస్క్ ప్రాంతంలోని యరోవా గ్రామంలో..
21మంది మృతి.. 30మందికి గాయాలు
కీవ్, సెప్టెంబరు 9: ఉక్రెయిన్లో ఘోరం జరిగింది. మంగళవారం రష్యా ప్రయోగించిన గ్లైడ్ బాంబ్ ఒకటి డోనెస్క్ ప్రాంతంలోని యరోవా గ్రామంలో పెన్షన్ కోసం లైన్లో నిల్చున్న వృద్ధులపై పడింది. ఈ ఘటనలో 21మంది చనిపోయారు. దాదాపు 30మంది గాయపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ విషయాన్ని వెల్లడించారు. రష్యా చర్యను తీవ్రంగా ఖండించారు. రష్యా దారుణాలపై ప్రపంచం మౌనంగా ఉండొద్దని కోరారు. మరిన్ని ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు. రష్యా దాడుల్లో ఉక్రెయిన్లో ఇప్పటివరకు 12వేల కంటే ఎక్కువ మంది సాధారణ పౌరులు మరణించినట్లు ఆయన వెల్లడించారు.
Updated Date - Sep 10 , 2025 | 03:28 AM