Today Horoscope: ఈ రాశి వారికి పెట్టుబడులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు
ABN, Publish Date - Oct 18 , 2025 | 04:45 AM
నేడు రాశిఫలాలు 18-10-2025 - శనివారం, శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు...
నేడు రాశిఫలాలు 18-10-2025 - శనివారం, శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు...
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పరిశ్రమలు, వ్యవసాయం రంగాల వారు సకాలంలో నిధులు సర్దుబాటు కాకపోవడంతో ఇబ్బంది పడతారు. వైద్యం, హోటల్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అధికం. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం. సినిమాలు, టెలివిజన్, క్రీడలు, విద్యా రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. మీ సృజనాత్మక ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. బదిలీలు, మార్పులకు అనుకూలం. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
స్థిర, చరాస్తులకు సంబంధించిన చర్చల్లో నిదానం పాటించాలి. రవాణా, మార్కెటింగ్, కమ్యూనికేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. శ్రీ వేంకటేశ్వర వజ్ర పారాయణ శుభప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరమైన చర్చలకు అనుకూలం విలువైన పత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. బిల్లులు, చెక్కులు మంజూరు కావడంలో జాప్యం జరగవచ్చు. గోమాతను ఆరాధించండి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. ఆర్థిక సంస్థలతో పనులకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. బ్యాంకులు, ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోతారు. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం. సినీ, రాజకీయ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. అనుకోని చిక్కులు ఎదురుకావడంతో మనశ్శాంతి కోల్పోతారు. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు,. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రదర్శనలు, ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించడం శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
పెద్దల సహకరారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల విషయంలో నిరాశతప్పకపోచ్చు. బృందకార్యక్రమాలకు ఖర్చులు అధికం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
పెద్దలతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. ఉన్నత విద్య, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారు వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యాసంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. సమావేశాల్లో పైఅధికారుల నుంచి మాట పడాల్సి వస్తుంది. మహావిష్ణువును ఆరాధించండి.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
రుణప్రయత్నాలు, పెట్టుబడులకు సంబంధించిన చర్చలకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పన్నులు, బీమా, పెన్షన్, గ్రాట్యుటీ వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మెడికల్ క్లెయిముల మంజూరులో జాప్యం జరుగుతుంది. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ పారాయణ శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి సహకారం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నిధుల విషయంలో బంధుమిత్రుల నుంచి మాటపడాల్సి రావచ్చు. పందాలు, పోటీల్లో నష్టపోయే అవకాశం ఉంది. గోమాతను ఆరాధించండి.
Updated Date - Oct 18 , 2025 | 04:45 AM