Today Horoscope: ఈ రాశి వారికి ప్రభుత్వ రంగ సంస్థలతో లావాదేవీలకు అనుకూలమైన రోజు
ABN, Publish Date - Aug 27 , 2025 | 12:28 AM
నేడు రాశిఫలాలు 27-8-2025 - బుధవారం, ప్రియతమలుతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి...
నేడు రాశిఫలాలు 27-8-2025 - బుధవారం, ప్రియతమలుతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ప్రియతమలుతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్య సేవల కోసం ఖర్చులు అధికం. మధ్యాహ్నం నుంచి వైద్య, సేవలు, హోటల్, కేటరింగ్ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి లక్ష్యాలు సాధిస్తారు. గణేశ పంచరత్నమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. ఖర్చులు అధికం. మధ్యాహ్నం నుంచి ప్రియతముల వైఖరిలో మార్పు గమనిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆడిటింగ్, ఆడ్వర్టయిజ్మెంట్, విద్యారంగా వారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. గణపతిని పూజించడం శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. మధ్యాహ్నం నుంచి కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, చర్చలు ఉల్లాసం క లిగిస్తాయి. తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు సంభవం. గణపతిని ఆరాధించండి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు సఫలం అవుతాయి. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తగవు. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మధ్యాహ్నం నుంచి కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచిస్తారు. ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. విఘ్ననాధుని ఆరాధన శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
విదేశీ ప్రయాణాలకు ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మధ్యాహ్నం నుంచి రాజకీయ, సినీ రంగాల వారు కొత్త ఆలోచనలు ఆమలు చేసే ప్రయత్నం చేస్తారు. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, టెక్స్టైల్స్ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గణపతిని ఆరాధించండి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
రాజకీయ, సినీ రంగాల వారికి ఆర్థికపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి నిధుల నిర్వహణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం నుంచి వేడుకలు,ప్రదర్శనలు, ఊరేగింపుల్లో పాల్గొంటారు. బృందకార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. గణపతిని పూజించండి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల కారణంగా మాటపడాల్సి రావచ్చు. బృందకార్యక్రమాల్లో శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. వేడుకల్లో ఖర్చులు అధికం. మధ్యాహ్నం నుంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. గణపతి ఆరాధన శుభప్రదం.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
సమావేశాల్లో మాటపడాల్సి రావచ్చు. మీ గౌరవానికి భంగం కలిగించే పరిణామాలు జరుగుతాయి. మధ్యాహ్నం నుంచి వృత్తి పరమైన సమావేశాలు, చర్చలకు అనుకూలం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలతో లావాదేవీలకు అనుకూలమైన రోజు. గణేశ స్తోత్ర పారాయణ వల్ల మేలు జరుగుతుంది.
మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. రక్షణ, బోధన, న్యాయ రంగాల వారికి ఆర్థిక విషయాల్లో నిరుత్సాకరంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి పెట్టుబడులకు సంబంధించిన మీ అంచనాలు ఫలిస్తాయి. దూరప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. విఘ్ననాధుని ఆరాధన వల్ల మేలు జరుగుతుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
స్పెక్యులేషన్లు, పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. విలువై వస్తువుల కొనుగోలు సమయంలో నాణ్యత పాటించాలి. మధ్యాహ్నం నుంచి శ్రీవారు, శ్రీమతి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వైద్యం, మరమ్మతులకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. వినాయకుని ఆరాధన శుభప్రదం.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఖర్చులు అధికం. మధ్యాహ్నం నుంచి జనసంబంధాలు విస్తరిస్తాయి. లక్ష్య సాధనలో శ్రీవారు, శ్రీమతి సహకారం అందుకుంటారు. వేడుకలు, విందుల్లో పాల్గొంటారు. సన్నిహితుల సహకారంతో ఆర్థిక పరమైన లక్ష్యాలు సాదిస్తారు. అన్నదానం శుభప్రదం,.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ
Updated Date - Aug 27 , 2025 | 12:28 AM