ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి వారు ఇతరులను కలుపుకుని మంచి పనులు చేపడతారు

ABN, Publish Date - Jul 22 , 2025 | 12:48 AM

నేడు రాశిఫలాలు 22-07-2025 మంగళవారం, బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి...

నేడు రాశిఫలాలు 22-07-2025 మంగళవారం, బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. చిన్నారులకు సంబంధించిన సమాచారం అనందం కలిగిస్తుంది. శుభవార్త అందుకుంటారు. స్నేహానుబంధాలు పెంపొందుతాయి. వాహనయోగం ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మీ ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. నిధుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలుకు అవసరమైన నిదులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఫర్చీచర్‌, నిత్యావసరాల వ్యాపారులకు అనుకూలమైన రోజు.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అడ్మిషన్లు లభిస్తాయి. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. మెయిల్స్‌, సందేశాలు ఆనందం కలిగిస్తాయి. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ శుభప్రదం.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

దూరప్రయాణాలకు అవసరమైన నిదులు అందుతాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. కళలు, న్యాయ, బోధన, రవాణా, పర్యాటర రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. హనుమాన్‌ చాలీసా పారాయణ శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. పెట్టుబడులు తదితర ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్య సాధనలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. సంకల్పం నెరవేరుతుంది.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. చేపట్టిన పనులు పూర్తి కావడంతో ఆనందంగా ఉంటుంది. సంకల్పం ఫలిస్తుంది.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రణాళికాబద్దంగా వ్యవహరించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉన్నత విద్యకు అవసరమైన నిదులు సర్దుబాటవుతాయి. సంకల్పం నెరవేరుతుంది.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పాత బకాయిలు వసూలవుతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పెద్దలను స్మరించుకుంటారు. పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు పాటించి మంచి ఫలితాలు పొందుతారు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

సమావేశాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ఇతరులను కలుపుకుని మంచి పనులు చేపడతారు. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. లక్ష్యాలు సాధిస్తారు.

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి. వైద్యం, హోటళ్లు, ఫార్మా, సేవల రంగాల వారికి ఆర్థికంగా అనుకూలమైన రోజు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

సంతానం విషయంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. సృజనాత్మక రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. గౌరవ, మర్యాదలు లభిస్తాయి. జనసంబంధాలు విస్తరిస్తాయి. శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. విందులకు ఏర్పాట్లు చేస్తారు. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సిబ్బంది నియామకాలకు అనుకూలం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jul 22 , 2025 | 12:48 AM