Today Horoscope: ఈ రాశి వారికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది
ABN, Publish Date - Aug 07 , 2025 | 01:29 AM
నేడు రాశి ఫలాలు 7-8-2025 గురువారం, టెలివిజన్, విద్య, ఆడిటింగ్, ప్రకటనల రంగాల వారికి వృత్తిపరంగా పోత్సాహకరంగా ఉంటుంది...
నేడు రాశి ఫలాలు 7-8-2025 గురువారం, టెలివిజన్, విద్య, ఆడిటింగ్, ప్రకటనల రంగాల వారికి వృత్తిపరంగా పోత్సాహకరంగా ఉంటుంది.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, విద్య, ఆడిటింగ్, ప్రకటనల రంగాల వారికి వృత్తిపరంగా పోత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. దత్త కవచ పారాయణ శుభప్రదం.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మధ్యాహ్నం నుంచి సమావేశాలు, ప్రయాణాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. బృందకార్యక్రమాల్లో అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. సాయిబాబా ఆరాధన మేలు చేస్తుంది.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
పన్నులు, పెట్టుబడులకు సంబంధించిన చర్చల్లో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన పత్రాలు అందుకుంటారు. మధ్యాహ్నం నుంచి సన్నిహితుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. వైద్య కోసం ఖర్చు చేస్తారు. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు ముఖమైన సమాచారం అందుకుంటారు. శ్రీ దత్త కవచ పారాయణ శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
వేడుకల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మధ్యాహ్నం నుంచి ఆర్థిక విషయాల్లో శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలకు ఈ రోజు అనుకూలం కాదు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన శుభప్రదం.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంలతో లక్ష్యాలు సాధిస్తారు. మధ్యాహ్నం నుంచి వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. విందు వినోదాల కోసం ఖర్చులు అంచనాలు మించిపోతాయి. దక్షిణా మూర్తి స్తోత్ర పారాయణ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
టెలివిజన్, క్రీడలు, ఆడిటింగ్, విద్యా సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి దూరప్రాంతంలో ఉన్న ప్రియతముల నుంచి ఆందోళనకరమైన సమాచారం అందుకోవాల్సి రావచ్చు. చిన్నారుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. సాయినాదుని ఆరాధించండి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు పెట్టుబడులను సమీక్షించుకుంటారు. సమావేశాలకు ఏర్పాట్లు చేస్తారు. మధ్యాహ్నం నుంచి బదిలీలు, మార్పులు కొంత అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల వ్యవహారశైలి ఆవేదన కలిగిస్తుంది. గాయత్రీ అష్టోత్తర శతనామార్చన శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
మార్కెటింగ్, రవాణా, బోధన, కమ్యూనికేషన్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఇంటర్వ్యూలలో లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా సరైన ఫలితాలు అందుకోలేకపోతారు. పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. గోమాతను ఆరాధించండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
విదేశీ ప్రయాణాలు, పైచదువులకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. మధ్యాహ్నం తరువాత బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మీ వ్యూహాలు ఫలించకపోవచ్చు. దత్త కవచ పారాయణ శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
మూచ్యువల్ ఫండ్స్, పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. మధ్యాహ్నం తరువాత ఆర్థిక విషయాల్లో కొత్త పథకాల అమలును వాయిదా వేయడం మంచిది. పన్నుల వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. గోమాత ఆరాధన మేలు చేస్తుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎగుమతులు, ఫొటోగ్రఫీ, టెక్స్టైల్స్, సినిమాలు, రాజకీయ రంగాల వారికి అనుకూల సమయం. మధ్యాహ్నం తరువాత సమావేశాల్లో అపవాదులు ఎదురవుతాయి. లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించండి.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. సమావేశాలు ఫలిస్తాయి. మధ్యాహ్నం నుంచి విందు వినోదాలు, వేడుకలకు ఖర్చులు అంచనాలు మించుతాయి. గోసేవ శుభప్రదం.
శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి
Updated Date - Aug 07 , 2025 | 01:29 AM