ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి వారు లక్ష్య సాధనలో మీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది

ABN, Publish Date - Sep 11 , 2025 | 02:08 AM

నేడు రాశిఫలాలు 11-09-2025 - గురువారం, వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి వైద్య సేవలకు అవసరమైన నిధులు..

నేడు రాశిఫలాలు 11-09-2025 - గురువారం, వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి వైద్య సేవలకు అవసరమైన నిధులు..

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి వైద్య సేవలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. దత్త కవచ పారాయణ శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

మీ ప్రతిభకు గుర్తింపు లభించికపోవడంతో నిరుత్సాహపడతారు. మధ్యాహ్నం నుంచి చిన్నారులు, ప్రియతముల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. ఆడ్వర్టయిజ్‌మెంట్స్‌, కన్సల్టెన్సీ, చిట్‌ఫండ్‌, టెలివిజన్‌, కళలు, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్ర పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. మధ్యాహ్నం నుంచి కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. గృహారంభ ప్రవేశాలకు సన్నాహాలు చేసుకుంటారు. ఇల్లు, స్థలసేకర ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. విద్యా సంస్థల్లో ప్రవేశం గురించి ఒక నిర్ణయినికి వస్తారు. సాయి సచ్చరిత్ర పారాయణ శుభప్రదం.

కర్కాటకం ( జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. మధ్యాహ్నం నుంచి కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రయాణాలు, చర్చలు లాభిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. అన్నదమ్ముల విషయాల్లో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. గోమాత ఆరాధన శుభప్రదం.

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. మధ్యాహ్నం నుంచి వ్యాపార రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల తోడ్పాటు లభిస్తుంది. ఉన్నత పదవులు అందుకుంటారు. దత్త కవచ పారాయణ శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

లక్ష్య సాధనలో మీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రచురణలు, రవాణా, న్యాయ, బోధన రంగాల వారు కొత్త పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు. లక్ష్మీనరసింహ స్తోత్ర పారాయణ శుఽభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. మధ్యాహ్నం నుంచి విదేశీ విద్యకు అవసర మైన నిధులు సర్దుబాటు అవుతాయి. గతంలో చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది. వైద్యం, బీమా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గాయత్రీ మాత ఆరాధన శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

పందాలు పోటీల్లో నెమ్మది పాటించాలి. మధ్యాహ్నం నుంచి శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. లక్ష్మీ నరసింహ స్వామి స్తోత్ర పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. మధ్యాహ్నం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. గోమాత సేవ శుభ ఫలితాలనిస్తుంది.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలించకపోవచ్చు. మధ్యాహ్నం నుంచి చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం. టెలివిజన్‌, రచనలు, కళలు, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దత్త కవచపారాయణ శుభప్రదం.

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. మధ్యాహ్నం నుంచి కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇల్లు, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాలను మీ వైఖరిని సమీక్షించుకుంటారు. గోమాతను ఆరాధించండి.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాల్లో, చర్చల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం నుంచి కమ్యూనికేషన్లు, మార్కెటింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల లాభిస్తాయి. శుభవార్త అందుకుంటారు. బందుమిత్రులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. సాయి సచ్చరిత్ర పారాయణ శుభప్రదం.

శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - Sep 11 , 2025 | 02:08 AM