ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి వారు కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు

ABN, Publish Date - Sep 20 , 2025 | 02:36 AM

నేడూ 18-09-2025 శనివారం, ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి.

నేడూ 18-09-2025 శనివారం, ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి.

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు. మెడికల్‌ క్లెయిములు మంజూరవుతాయి. వైద్యం, హోటళ్లు, ఫార్మా, సేవల రంగాల వారికి ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

సంతానం విషయంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. సృజనాత్మక రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. గౌరవ, మర్యాదలకు భంగం కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అధికం. శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచపారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. విందులకు ఏర్పాట్లు చేస్తారు. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల అఽధికం. కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఆంజనేయ స్వామిని ఆరాధించండి.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. చిన్నారులకు సంబంధించిన సమాచారం అనందం కలిగిస్తుంది. స్నేహానుబంధాలు పెంపొందుతాయి. చర్చల్లో, వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మీ ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. నిధుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. స్థిరాస్తి వ్యాపారులు నిదులు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. గోమాతను ఆరాధించండి.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అడ్మిషన్లు లభిస్తాయి. మెయిల్స్‌, సందేశాలు ఆనందం కలిగిస్తాయి. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వాగ్వివాదాలు దూరంగా ఉండటం మేలు. నవగ్రహాలను ఆరాధించండి.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

దూరప్రయాణాలకు అవసరమైన నిదులు అందుతాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. కళలు, న్యాయ, బోధన, రవాణా, పర్యాటర రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించడి.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్య సాధనలో బంధుమిత్రుల లోపిస్తుంది. ఖర్చులు అధికం. విష్ణు సహస్ర స్తోత్ర పారాయణ శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో ప్రముఖులను కలుసుకుంటారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. లక్ష్య సాధనలో గత అనుభవం తోడ్పడుతుంది. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రణాళికాబద్దంగా వ్యవహరించి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉన్నత విద్యకు అవసరమైన నిదులు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. విష్ణుమూర్తిని ఆరాధించండి.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. పాత బకాయిలు వసూలవుతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పెద్దలను స్మరించుకుంటారు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, ఆర్థిక లావాదేవీల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ఇతరులను కలుపుకుని మంచి పనులు చేపడతారు. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. సమావేశాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. గోమాతను ఆరాధించండి.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Sep 20 , 2025 | 02:36 AM