ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Today Horoscope: ఈ రాశి వారు రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ రంగాలలో ఆచితూచి వ్యవహరించాలి

ABN, Publish Date - Sep 30 , 2025 | 02:16 AM

నేడూ రాశిఫలాలు 30-09-2025 సమావేశాల్లో, బృందకార్యక్రమాల్లో మాటపడాల్సి రావచ్చు. వివాహ నిర్ణయాల విషయంలో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది...

నేడూ రాశిఫలాలు 30-09-2025 సమావేశాల్లో, బృందకార్యక్రమాల్లో మాటపడాల్సి రావచ్చు. వివాహ నిర్ణయాల విషయంలో పెద్దల వైఖరి...

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

సమావేశాల్లో, బృందకార్యక్రమాల్లో మాటపడాల్సి రావచ్చు. వివాహ నిర్ణయాల విషయంలో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. కీలక పదవుల విషయంలో ఆశాభంగం కలిగే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటల తరువాత పెద్దల నుంచి ప్రోత్సాహం లభించడంతో లక్ష్యాలు సాధిస్తారు. శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు, చర్చలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. న్యాయ, బోధన, కళలు, రవాణా, రక్షణ రంగాల వారికి అనుకోని సమస్యలు ఎదురవుతాయి. సాయంత్రం తరువాత వేడుకలు, ఆధ్మాత్మిక కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. లలితా సహస్ర నామ పారాయణ శుభప్రదం.

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల ఆరోగ్యం కలవరపెడుతుంది. బీమా, పన్నులు, పెన్షన్‌ వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురవుతాయి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. దుర్గామాతను ఆరాఽధించండి.

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

సన్నిహితుల వైఖరి మనస్తాపానికి గురిచేస్తుంది. వేడుకల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. సమావేశాల్లో మాటపడాల్సి రావచ్చు. భాగస్వామి వైఖరి బాధిస్తుంది. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. సాయంత్రం నుంచి శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆనందం కలిగిస్తుంది. ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాల్సి వస్తుంది.. సన్నిహితుల ఆరోగ్యం కలవరపెడుతుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో పొరపాట్లు కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. సాయంత్రం నుంచి ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సౌందర్య లహరీ పారాయణ శుభప్రదం.

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రియతముల కోసం ఖర్చులు అంచనాలు మించుతాయి. క్రీడలు, ఆడిటింగ్‌, టెలివిజన్‌ రంగాల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువుల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి. సాయంత్రం తరువాత ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. లలితా సహస్రనామ పారాయణ శుభప్రదం.

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

అనుకున్న పనులు పూర్తి కాకపోవడంతో నిరాశకు లోనవుతారు. కుటుంబ విషయాలో కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. మీ ఆలోచనలను సమీక్షించుకుంటారు. సాయంత్రం నుంచి కుటుంబ వ్యవహారాలు ఆనందం కలిగిస్తాయి. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

లక్ష్య సాధనలో విద్యార్థులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్తలు పాటించండి. కీలక పత్రాలు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవింగ్‌లో నిదానం అవసరం. సాయంత్రం తరువాత ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. దుర్గాదేవి ఆరాధ న శుభప్రదం.

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. బృంద కార్యక్రమాలు కోసం ఖర్చులు అధికం. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. వృధా ఖర్చులను నివారించడం మంచిది. సాయంత్రం తరువాత ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

గౌరవ, ప్రతిష్ఠలకు భంగం కలిగే అవకాశం ఉంది. పెద్దలు, పై అధికారుల నుంచి మాటపడాల్సి రావచ్చు. కొత్త పనుల ప్రారంభాన్ని వాయిదా వేయడం మంచిది. సాయంత్రం తరువాత లక్ష్య సాధనలో పెద్దల సహకారం లభిస్తుంది. శ్రీ దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

దూరప్రయాణాలు, ఉన్నత విద్యా విషయాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంచనాలు ఫలించకపోవడంతో ఆందోళనకు గురవుతారు. సమావేశాలు, చర్చలు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం తరువాత ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం దుర్గామాతను ఆరాధించండి.

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ఆశాభంగానికి గురవుతారు. రుణ బాధ పెరుగుతుంది. సన్నిహతుల రోగ్యం కలపవరపెడుతుంది. బృంద కార్యక్రమాల కోసం ఖర్చులు అధికం. విలువైన వస్తువుల విషయాలో అప్రమత్తత అవసరం. సాయంత్రం తరువాత వేడుకలు ఆనందం కలిగిస్తాయి. లలితా దేవిని ఆరాధించండి.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Sep 30 , 2025 | 02:16 AM