Mallanna Darshan Attracts: మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Aug 11 , 2025 | 03:37 AM
భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నంద్యాల
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): భ్రమరాంబికా మల్లికార్జునస్వామి దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రం కిటకిటలాడింది. ఆదివారం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆ తర్వాత స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
Updated Date - Aug 11 , 2025 | 03:37 AM