ఏటీఆర్ విమానాలకు పెరుగుతున్న గిరాకీ
ABN, Publish Date - Jun 09 , 2025 | 05:31 AM
ప్రాంతీయ విమానయానం అభివృద్ధితో మన దేశంలో స్వల్పదూరం ప్రయాణించే ఏటీఆర్ విమానాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఇండిగో, అలయెన్స్ ఎయిర్, ఫ్లై91 వంటి సంస్థలు...
వచ్చే పదేళ్లలో 300 విమానాలు అవసరం
న్యూఢిల్లీ: ప్రాంతీయ విమానయానం అభివృద్ధితో మన దేశంలో స్వల్పదూరం ప్రయాణించే ఏటీఆర్ విమానాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఇండిగో, అలయెన్స్ ఎయిర్, ఫ్లై91 వంటి సంస్థలు ఈ తరహా విమానాలు 70 వరకు వినియోగిస్తున్నాయి. వచ్చే పదేళ్లలో బారత్లో 300కు పైగా ఏటీఆర్ విమానాలకు డిమాండ్ ఉంటుందని ఏటీఆర్ కంపెనీ అంచ నా. ఇందుకోసం ఇప్పటికే భారత్లోని పలు విమానయాన సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు కంపెనీ ఎండీ పీరే క్లెర్సిన్ చెప్పారు. భారత్లో వచ్చే ఐదేళ్లలో కొత్తగా మరో 50 కొత్త విమానాశ్రయాలు రానున్నాయి. దీంతో ప్రాంతీయ విమానయానం మరింత పుంజుకుంటుందని ఏటీఆర్ కంపెనీ భావిస్తోంది.
ఇవీ చదవండి:
దేశంలో ట్సాక్స్ ఫ్రీ స్టేట్ గురించి తెలుసా.. ఎంత సంపాదించినా
4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 09 , 2025 | 05:31 AM