విద్యాలక్ష్మి పథకంపై వడ్డీ 0 20 శాతం తగ్గింపు
ABN, Publish Date - Jun 04 , 2025 | 05:52 AM
ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) విద్యాలక్ష్మి పేరిట అందిస్తున్న విద్యా రుణాలపై వడ్డీ రేటును 0.20 శాతం మేరకు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) విద్యాలక్ష్మి పేరిట అందిస్తున్న విద్యా రుణాలపై వడ్డీ రేటును 0.20 శాతం మేరకు తగ్గించింది. ఈ తగ్గింపుతో ఈ పథకంపై కనీస వడ్డీ 7.5 శాతానికి తగ్గుతుంది. విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలన్న తమ కట్టుబాటుకు ఇది నిదర్శనమని పీఎన్బీ తెలిపింది. దేశంలో అత్యున్నత నాణ్యత గల విద్యను అందిస్తున్న 860 విద్యా సంస్థల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఇది అందుబాటులో ఉంటుంది.
రూ. 170 కోట్లతో పారస్ హెల్త్కేర్లో 360 వన్ అసెట్ పెట్టుబడి
360 వన్ అసెట్, పారస్ హెల్త్కేర్ (ఉత్తర భారతదేశంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్)లో రూ. 170.60 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. ఈ పెట్టుబడిలో ప్రాథమిక పెట్టుబడి, అలాగే ప్రస్తుత పెట్టుబడిదారుడి పాక్షిక నిష్క్రమణతో కూడిన సెకండరీ పెట్టుబడి ఉన్నాయి. భారతీయ హెల్త్కేర్ సర్వీసెస్ విభాగంలో 360 వన్ అసెట్కి ఇది ఏడో పెట్టుబడి. దీర్ఘకాలికంగా ఈ రంగం వృద్ధి చెందుతుందన్న తమ నమ్మకానికి ఇది నిదర్శనమని 360 వన్ అసెట్ సీనియర్ ఫండ్ మేనేజర్, స్ట్రాటెజీ హెడ్ ఉమేష్ అగ్రవాల్ తెలిపారు. మార్కెట్లో తమ ప్రీ-ఐపీఓ వ్యూహంలో భాగంగా ఈ పెట్టుబడి చేశామని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 04 , 2025 | 10:08 PM