పతంజలి చేతికి మాగ్మా ఇన్సూరెన్స్
ABN, Publish Date - Apr 17 , 2025 | 03:32 AM
యోగా గురువు బాబా రాందేవ్ నాయకత్వంలోని పతంజలి ఆయుర్వేద్ కంపెనీ బీమా రంగంలోకి ప్రవేశిస్తోంది. మరో ఐదు సంస్థలతో కలిసి మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈక్విటీలో 98.05 శాతం...
న్యూఢిల్లీ : యోగా గురువు బాబా రాందేవ్ నాయకత్వంలోని పతంజలి ఆయుర్వేద్ కంపెనీ బీమా రంగంలోకి ప్రవేశిస్తోంది. మరో ఐదు సంస్థలతో కలిసి మాగ్మా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈక్విటీలో 98.05 శాతం వాటా కొనుగోలు చేసేందుకు కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదం తెలిపింది. పతంజలితో పాటు ఎస్ఆర్ ఫౌండేషన్, రితి ఫౌండేషన్, ఆర్ఆర్ ఫౌండేషన్, సురుచి ఫౌండేషన్, స్వాతి ఫౌండేషన్ ఈ లావాదేవీలో భాగస్వాములవుతున్నాయి. సీసీఐ గ్రీన్ సిగ్నల్తో బీమా రంగంలో ప్రవేశించేందుకు పతంజలి ఆయుర్వేద్కు మార్గం సుగమమైంది.
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 17 , 2025 | 03:32 AM