NSE: ఒడిశా ప్రభుత్వంతో ఎన్ఎస్ఈ ఒప్పందం..
ABN, Publish Date - May 16 , 2025 | 11:10 PM
ఒడిశాలో ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడిదారుల అవగాహన పెంచడానికి, బీఎఫ్ఎస్ఐ రంగంలో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా
ముంబై: ఒడిశాలో ఆర్థిక అక్షరాస్యత, పెట్టుబడిదారుల అవగాహన పెంచడానికి, బీఎఫ్ఎస్ఐ రంగంలో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరచడానికి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) ఒడిశా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా సెమినార్లు, వర్క్షాప్ల ద్వారా అవగాహన కల్పిస్తారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఒడిశా మంత్రి సుర్యబంశీ సూరజ్, ఎన్ఎస్ఈ అధికారి శ్రీరామ్ కృష్ణన్ ఈ భాగస్వామ్యాన్ని స్వాగతించారు. 2024-25లో ఎన్ఎస్ఈ దేశవ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది.
కల్పతరు ప్రాజెక్ట్స్కు..
విద్యుత్, మౌలిక సదుపాయాల రంగంలో ప్రముఖ ఇంజనీరింగ్ మరియు నిర్మాణ సంస్థ అయిన కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (కేపీఐఎల్) తన అంతర్జాతీయ అనుబంధ సంస్థల ద్వారా భారీ మొత్తంలో కొత్త కాంట్రాక్టులను దక్కించుకుంది. సంస్థకు తాజాగా సుమారు 2,372 కోట్ల రూపాయల విలువైన కొత్త ఆర్డర్లు లభించాయి.
Updated Date - May 16 , 2025 | 11:10 PM