స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ మార్చితో ముగిసిన
ABN, Publish Date - May 16 , 2025 | 04:26 AM
స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్.. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ.407.36 కోట్ల ఆదాయంపై రూ.35.25 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2023-24తో పోల్చితే ఆదాయం (రూ.151.21 కోట్లు) 169.40 శాతం వృద్ధి...
స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్.. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను రూ.407.36 కోట్ల ఆదాయంపై రూ.35.25 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2023-24తో పోల్చితే ఆదాయం (రూ.151.21 కోట్లు) 169.40 శాతం వృద్ధి చెందగా లాభం (రూ.10.82 కోట్లు) ఏకంగా 225.79 శాతం పెరిగింది. కాగా బ్లాక్చెయిన్ వాలిడేషన్ నోడ్స్ కోసం క్లౌడ్ డేటా సెంటర్లలో 5 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.
జూ ఫిన్టెక్ సంస్థ జాగిల్.. మెష్ పేమెంట్స్తో వ్మూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా మెష్ పేమెంట్స్ తన అంతర్జాతీయ కస్టమర్లకు జాగిల్కు చెందిన ప్రీపెయిడ్ కార్డులు, ఫారెక్స్ కార్డులు, క్రెడిట్ కార్డుల వంటి స్పెండ్ మేనేజ్మెంట్ సేవలను అందించనుంది. మెష్ పేమెంట్స్కు అంతర్జాతీయ ట్రావెల్, స్పెండ్ సొల్యూషన్స్ సేవల్లో మంచి పేరుంది. ఇప్పటికే ఈ కంపెనీ అమెరికా, యూరప్, లాటిన్ అమెరికాల్లోని భారత ఎంఎన్సీలకు సేవలందిస్తోంది.
Also Read:
SJaishankar: కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదు
ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్..ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - May 16 , 2025 | 04:27 AM