డిపాజిట్ ఇన్సూరెన్స్ పరిమితి పెంపు?
ABN, Publish Date - Feb 18 , 2025 | 01:32 AM
బ్యాంకు డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకం పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి మరింత పెంచే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం (డీఎ్ఫఎస్)...
ముంబై: బ్యాంకు డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకం పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి మరింత పెంచే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం (డీఎ్ఫఎస్) కార్యదర్శి నాగరాజు ఈ విషయం వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ఆ విషయాన్ని నోటిఫై చేస్తామన్నారు. ముంబై కేంద్రంగా ఉన్న న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు భావిస్తున్నారు.
ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక ప్రకటించిన గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్లో దేశంలో ప్రీమియర్ బిజినెస్ స్కూల్గా ఐఎ్సబీ తొలి స్థానాన్ని మరోసారి కైవసం చేసుకుంది. అలాగే ప్రపంచంలో తన ర్యాంకింగ్ను 31 నుంచి 27వ స్థానానికి పెంచుకుంది. ఆసియాలో 5వ స్థానాన్ని నిలబెట్టుకుంది.
ప్యాకేజింగ్ సేవలు అందించే అమెరికా సంస్థ సొనోకో ప్రొడక్ట్స్ హైదరాబాద్లో పెర్ఫార్మెన్స్ హబ్ పేరుతో తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని (జీసీసీ) ఏర్పాటు చేసింది. రూ.86 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో 300 మంది టెక్నాలజిస్టులు పని చేయనున్నారు.
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..
BSNL: రీఛార్జ్పై టీవీ ఛానెల్లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 18 , 2025 | 01:32 AM