ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పసిడి ర్యాలీకి బ్రేక్‌

ABN, Publish Date - Jun 04 , 2025 | 06:07 AM

పసిడి ర్యాలీకి బ్రేక్‌ పడే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే రెండు నెలల్లో డాలర్లపరంగా పసిడి ధర 12 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తన నెలవారీ నివేదికలో...

15% వరకు తగ్గనున్న ధర

క్వాంటమ్‌ ఎంఎఫ్‌ అంచనా

న్యూఢిల్లీ: పసిడి ర్యాలీకి బ్రేక్‌ పడే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే రెండు నెలల్లో డాలర్లపరంగా పసిడి ధర 12 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తన నెలవారీ నివేదికలో తెలిపింది. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) మేలిమి పసిడి ధర 3,350 డాలర్ల వద్ద ట్రేడైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో నమోదైన 3,500 డాలర్లతో పోలిస్తే ఇది 150 డాలర్లు తక్కువ. భారత మార్కెట్లోనూ ఏప్రిల్‌లో రూ.లక్ష ఎగువన ట్రేడైన 10 గ్రాముల మేలిమి బంగారం ప్రస్తుతం రూ.లక్ష దిగువన ట్రేడవుతోంది. అయితే మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడులకు మాత్రం బంగారం ఇప్పటికీ ఆకర్షణీయంగానే కనిపిస్తోందని క్వాంటమ్‌ ఎంఎఫ్‌ తన నివేదికలో తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మధ్య, దీర్ఘకాలిక లాభాల కోసం చూసే మదుపరులు తమ పెట్టుబడుల్లో ఎంతో కొంత పసిడిలో మదుపు చేయడం మంచిదని సూచించింది.

ధర పతనానికి కారణాలు

  • ప్రధాన కరెన్సీలతో పుంజుకుంటున్న డాలర్‌ మారకం రేటు

  • అమెరికా-చైనా సుంకాల యుద్ధం ముగుస్తుందనే అంచనాలు

  • కొనసాగుతున్న లాభాల స్వీకరణ అమ్మకాలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 04 , 2025 | 06:07 AM