యోగా చేద్దాం
ABN, Publish Date - May 26 , 2025 | 12:23 AM
ప్రపంచ యోగా దినోత్సవం జరిగే జూన్ 21లోగా జిల్లాలోని ప్రజలం దరూ ఇందులో భాగస్వామ్యం కావాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఏలూరు, మే 25(ఆంధ్రజ్యోతి): ప్రపంచ యోగా దినోత్సవం జరిగే జూన్ 21లోగా జిల్లాలోని ప్రజలం దరూ ఇందులో భాగస్వామ్యం కావాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి విజ్ఞప్తి చేశారు. జాయింట్ కలెక్టర్ బంగ్లా నుంచి ఆదివారం యోగాంధ్ర కార్యక్రమంపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 299 మంది మాస్టర్ ట్రైనీలకు శిక్షణ పూర్తయిందని, ప్రతీ సచివాలయం పరిధిలో మరో 100 మంది ట్రైనీల కు శిక్షణ చేపట్టాలన్నారు. ఈ నెల 26 నుంచి జూన్ 14 వరకు యోగాపై ప్రత్యేక కార్యక్రమాలకు చర్యలు తీసు కుంటున్నామన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రతీ ఒక్కరూ క్యూఆర్ కోడ్ లేదా వెబ్ ద్వారా నమోదు కావాలని కోరారు. జిల్లాలో 8లక్షల మంది రిజిస్ర్టేషన్ లక్ష్యమని ధాత్రిరెడ్డి తెలిపారు.
Updated Date - May 26 , 2025 | 12:23 AM