జిల్లా జడ్జిగా శ్రీదేవి బాధ్యతల స్వీకరణ
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:56 AM
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎస్.శ్రీదేవి శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జిల్లా న్యాయ మూర్తుల బదిలీలు జరిగాయి.
ఏలూరు క్రైం, ఏలూరు 18 (ఆంధ్ర జ్యోతి): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎస్.శ్రీదేవి శుక్రవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జిల్లా న్యాయ మూర్తుల బదిలీలు జరిగాయి. ఈ బదిలీ లలో విజయవాడ కోర్టు (ఎంపీ, ఎమ్మెల్యే లపై ఉన్న క్రిమినల్ కేసులు విచారణ) ప్రత్యేక న్యాయమూర్తిగా విధులు నిర్వర్తి స్తున్న శ్రీదేవిని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమిం చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏలూరు జిల్లా కోర్టులోని తన చాంబర్లో ఉద్యోగ బాధ్యతలను స్వీకరించారు. ఇప్ప టివరకు పూర్తి అదనపు బాధ్యతల జిల్లా జడ్జిగా ఒకటో అదనపు జిల్లా జడ్జి ఎం.సునీల్ కుమార్ నిర్వర్తిస్తున్నారు. ఆయన నుంచి బాధ్యతలను జడ్జి శ్రీదేవి చేపట్టారు. జడ్జి సునీల్ కుమార్ను విజయవాడకు బదిలీ చేశారు.
Updated Date - Apr 19 , 2025 | 12:56 AM