ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆటో కనిపిస్తే మాయం చేస్తాడు

ABN, Publish Date - Apr 23 , 2025 | 12:54 AM

ఇంటి ముందు ఆటో పార్క్‌చేసి ఉందంటే తెల్లారేసరికి మాయం చేస్తున్న మాయగాడిని తాడేపల్లిగూడెం పోలీసులు పట్టుకున్నారు.

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు

ఏడు ఆటోలతో నిందితుడిని పట్టుకున్న పోలీసులు

తాడేపల్లిగూడెం రూరల్‌ ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఇంటి ముందు ఆటో పార్క్‌చేసి ఉందంటే తెల్లారేసరికి మాయం చేస్తున్న మాయగాడిని తాడేపల్లిగూడెం పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద రూ.14లక్షల విలువ చేసే 7 ఆటోలను స్వాదీనం చేసుకున్నారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ ఎం విశ్వనాథ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో ఆటోల అపహరణ కేసులు నమోదవుతుండడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. తాడేపల్లిగూడెం మామిడితోటకు చెందిన ములగాల వెంకటేశ్వర రావును అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు అపహరించిన ఏడు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఆటోల చోరీ కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్సైలు బాదం శ్రీను, పి నాగరాజు, సిబ్బందిని డీ ఎస్పీ విశ్వనాథ్‌ అభినందించారు.

Updated Date - Apr 23 , 2025 | 12:54 AM