ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:00 AM
మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం త్వరిత గతిన పూర్తిచేయాలని పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. గురువారం పట్టణంలో ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు.
బెలగాం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి):మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం త్వరిత గతిన పూర్తిచేయాలని పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. గురువారం పట్టణంలో ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టర్ల నుంచి పనుల గురించి అడిగితెలుసుకున్నారు.పనుల్లో నాణ్యతలోపం లేకుండా త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. తొలుత జిల్లా ఆసు పత్రిలో ఆకస్మికంగా తనిఖీచేశారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరాతీశారు.కార్యక్రమంలో వైద్యాధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
‘అమృత్సరోవర్’తో చెరువుల అభివృద్ధి
పార్వతీపురం రూరల్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి):అమృత సరోవర్ పథకం ద్వారా చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. గురువారం మండలంలోని నర్సిపురంలో అమృత సరోవర పథకం ద్వారా చేపడు తున్న చెరువుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఏపీవో కృష్ణారావు, ఈసీ కృష్ణారావు పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 12:00 AM