ఐటీడీఏలో ముగిసిన ఉపాధ్యాయ కౌన్సిలింగ్
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:04 AM
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు ల బదిలీలకు సంబంధించిన కౌన్సిలింగ్ శనివారంతో ముగిసింది.
బదిలీ అయిన ఉపాధ్యాయులకు ఆర్డర్ కాపీ అందజేస్తున్న ఇన్చార్జి పీవో యశ్వంత్కుమార్
సీతంపేట రూరల్, మే 31(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు ల బదిలీలకు సంబంధించిన కౌన్సిలింగ్ శనివారంతో ముగిసింది. ఐటీడీఏ ఇన్చార్జి పీవో సి.యశ్వంత్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్జెక్ట్ టీచర్లకు స్థానచలనం కల్పించా రు. మొత్తంగా 43 మంది ఉపాధ్యాయులకు గాను ఎస్జీటి 37, ఎల్పీ తెలుగు 3, హిందీ ముగ్గురికి కౌన్సి లింగ్ నిర్వహించి ఆర్డర్లు అందజేశారు. ఈ బదిలీల ప్రక్రియలో ఏపీవో జి.చిన్నబాబు, డీడీ అన్నదొర, ఏటీడబ్ల్యూవో మంగవేణి, జీసీడీవో రాములమ్మ, ఏఎంవో కోటిబాబు, హెచ్ఎం నారాయడు ఉన్నారు.
Updated Date - Jun 01 , 2025 | 12:04 AM