విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
ABN, Publish Date - May 06 , 2025 | 11:54 PM
విద్యార్థులు మరింత ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆకాంక్షించారు.
గుమ్మలక్ష్మీపురం, మే 6 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు మరింత ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆకాంక్షించారు. మంగళవారంగుమ్మలక్ష్మీపురం జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మండల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందించారు.ఈ కార్యక్రమం లో విశ్రాంత డీఈవో ఎన్టీ నాయుడు, డిప్యూటీ డీఈవో జ్ఞానప్రకాష్, ఏటీడబ్ల్యువో సురేష్, విద్యా కమిటీ చైర్మన్ శొంఠ్యాన రాజేష్, ఎంఈవో-1 చంద్రశేఖర్, ఎంఈవో-2 భీముడు, మండలంలోని 13 పాఠశాలల ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Updated Date - May 06 , 2025 | 11:54 PM