తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ
ABN, Publish Date - May 14 , 2025 | 12:29 AM
పట్టణంలోని 30 వార్డుల్లో వేసవిలో ఎటువంటి ఇబ్బం దులు లేకుండా తాగునీటి సరఫరాకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవా రం పట్టణంలోని శివా రు కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా పంపిణీని పరిశీలించా రు.
పార్వతీపురంటౌన్, మే 13 (ఆంధ్రజ్యో తి): పట్టణంలోని 30 వార్డుల్లో వేసవిలో ఎటువంటి ఇబ్బం దులు లేకుండా తాగునీటి సరఫరాకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవా రం పట్టణంలోని శివా రు కాలనీల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా పంపిణీని పరిశీలించా రు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి నీటిఎద్దడి నివారణకోసం యుద్దప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి సమీపంలోని నాగావళి నది నుంచి ప్రధాన పంప్హౌస్కునీటిని మళ్లించేందుకుప్రణాళికలు సిద్ధంచేశామన్నారు. ఆయావార్డుల్లో తాగునీటిసరఫరాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంజ నీరింగ్ విభాగానికి అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. వైకేఎం,కొత్తవలస గ్రీన్ఫీల్డ్ కాలనీ, నవిరి, జనశక్తి, తదితర పట్టణ శివారుల్లోఉన్న కాలనీలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరం దిస్తున్నామని తెలిపారు. తాగునీటి సరఫరాకు సంబంధించి వార్డుల్లో సమస్యలు ఉంటే కార్యాలయానికి వచ్చి తెలియజేయాలని కోరారు
Updated Date - May 14 , 2025 | 12:29 AM