మారికవలసలో గరివిడి విద్యార్థి ఆత్మహత్య
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:12 AM
పట్టణంలోని బీపీ కాలనీ (బద్దెప్రసాద్ కాలనీ)కి చెందిన విద్యార్థి తీడ వే దాంత కార్తికేయ (16) మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గరివిడి, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బీపీ కాలనీ (బద్దెప్రసాద్ కాలనీ)కి చెందిన విద్యార్థి తీడ వే దాంత కార్తికేయ (16) మంగళవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కార్తీకేయను ఐదు రోజుల కిం దట విశాఖ జిల్లా మారికవలసలోని ఓజాన్ వ్యాలీ లో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో తల్లిదండ్రులు అ చ్యుతరావు, పార్వతి జాయిన్ చేశారు. బుధవారం ఉదయం కళాశాల హాస్టల్ గదిలో కార్తికేయ ఉరి వేసుకుని ఉండటాన్ని కళాశాల సిబ్బంది గమనించి దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కార్తీకేయ మృతి చెందినట్టు వైద్యాధికారులు నిర్ధారించారు. కార్తికేయ గరివిడిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదోతరగతి చదివాడు. పరీక్ష ఫలితాలు ఇంకా రాలేదు. నెమ్మ దస్తుడిగా, చదువులో చురుగ్గా ఉండే కార్తికేయ ఆత్మహత్య పాల్పడటాన్ని తోటి విద్యార్థులు, స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:12 AM