గంజాయి రవాణా నిర్మూలనకు చర్యలు
ABN, Publish Date - Jun 02 , 2025 | 12:25 AM
ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి రవాణా నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని బొబ్బిలి డీఎస్పీ భవ్యా రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని ఎను బరువు వద్ద 6లైన్రోడ్డును పరిశీలించారు.
రామభద్రపురం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి రవాణా నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని బొబ్బిలి డీఎస్పీ భవ్యా రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని ఎను బరువు వద్ద 6లైన్రోడ్డును పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల ఒడిశా నుంచి ఎక్కువగా గంజాయి రవాణా అవుతున్నట్లు సమాచా రం అందడంతో ఈ రోడ్డులో మరో కొత్త చెక్పోస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా పాచిపెంట మండలంలోని మాతుమూరు వద్దగాని, హెచ్జీ ఇన్ఫ్రా స్టెక్టర్ ఆఫీసు వద్దగాని చెక్పోస్టు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రామభద్రపు రం మండలంలోని కొట్టక్కి వద్ద ఒక చెక్పోస్టు ఏర్పాటు చేశామని, దీంతో ఇటీవల గంజాయి అక్ర మ రవాణాను నిరోధించామని చెప్పారు. కార్యక్ర మంలో బొబ్బిలి రూరల్ సీఐ కే.నారాయణరావు, ఎస్ఐ వెలమల ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jun 02 , 2025 | 12:25 AM