కార్పొరేట్ల కోసమే కార్మిక చట్టాలు రద్దు
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:02 AM
కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాలు, కమిషన్లకోసం రద్దు చేసిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు ఆరోపించారు.
పాలకొండ, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనాలు, కమిషన్లకోసం రద్దు చేసిందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు ఆరోపించారు. గురువారం పాలకొండలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బి. అమరవేణి అధ్యక్షతన పాలకొండ మండల సీఐటీయూ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లు రద్దయ్యే వరకూ పోరాడుతామని తెలిపారు. జూలై 9న జరిగే సమ్మెను జయప్రదం కోసం ఈనెల 25న పాలకొండలో పాతబస్టాండ్ వద్ద జీపుజాతా ప్రారంభమవుతుందన్నారు. సమావేశంలో ఎడ్ల శ్రీనివాసరావు, గోవిందరావు, సంజీవి, కాద రాము, జెస్సీబాయి, శారద, శ్రీదేవి, చిట్టెమ్మ, కమల, బుజ్జి, లలిత పాల్గొన్నారు.
Updated Date - Jun 20 , 2025 | 12:02 AM