కూటమితోనే అభివృద్ధి
ABN, Publish Date - Jul 05 , 2025 | 12:31 AM
కూటమి ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ జగదీశ్వరి
సాలూరు, జూలై 4(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పట్టణం లోని 21, 22 వార్డుల్లో శుక్రవారం నిర్వహించిన ఇంటింటి కి తెలుగుదేశం-సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్ర మంలో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా వార్డు వాసు లు ఆమెకు స్వాగతం పలికారు. ఆమె ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల అభి ప్రాయాలను తెలుసుకుని సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బందాపు సీతమ్మ, అల్లు అప్ప య్యమ్మ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతి రావు, బృందావనం అశోక్, కారేపు చంద్ర తదితరులు పాల్గొన్నారు.
జియ్యమ్మవలస, జూలై 4 (ఆంధ్రజ్యోతి): అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని వెలుగు బాటలో నడుపుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడు తున్న ప్రజల ప్రభుత్వం ఇది అని ప్రభుత్వ విప్, కురు పాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. కన్నపుదొర వలస పంచాయతీ కేంద్రంలో శుక్రవారం ఆమె సుపరిపా లన మొదటి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్య క్రమాలను వివరిస్తూ వారికి అవగాహన కల్పించారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, పార్టీ అరకు పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపీపీ బొంగు సురేష్, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 05 , 2025 | 12:32 AM