సమతా ఎక్స్ప్రెస్ తాత్కాలికంగా రద్దు
ABN, Publish Date - Apr 17 , 2025 | 12:55 AM
నాగపూర్ డివిజన్లో ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో విశాఖ, నిజాముద్దీన్ మధ్య రాకపోకలు సాగించే సమతా ఎక్స్ప్రెస్ సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేశామని సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): నాగపూర్ డివిజన్లో ట్రాక్ నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో విశాఖ, నిజాముద్దీన్ మధ్య రాకపోకలు సాగించే సమతా ఎక్స్ప్రెస్ సర్వీసులను తాత్కాలికంగా రద్దుచేశామని సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖ-నిజాముద్దీన్ మధ్య నడిచే సమతా ఎక్స్ప్రెస్ (12807) ఈనెల 30, మే 1, 3, 4, 6 తేదీల్లో రద్దు చేశామన్నారు. తిరుగు ప్రయాణంలోని నిజాముద్దీన్-విశాఖ సమతా ఎక్స్ప్రెస్ (12808) మే 2, 3, 5, 6, 8 తేదీల్లో రద్దుచేశామని, ప్రయాణికులు గమనించాలన్నారు.
Updated Date - Apr 17 , 2025 | 12:55 AM