నేడు నర్సీపట్నంలో పీజీఆర్ఎస్
ABN, Publish Date - Apr 28 , 2025 | 12:52 AM
నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ విజయకృష్ణన్
అనకాపల్లి కలెక్టరేట్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల డివిజన్స్థాయి అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని నర్సీపట్నం నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనకాపల్లిలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
Updated Date - Apr 28 , 2025 | 12:52 AM