ఓవర్ లోడుతో వెళుతున్న వాహనాల తనిఖీ
ABN, Publish Date - Aug 04 , 2025 | 11:38 PM
స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఆదేశాల మేరకు వెంకన్నపాలెం వద్ద ఓవర్ లోడుతో వెళుతున్న వాహనాలు తనిఖీ చేసేందుకు తాత్కాలిక చెక్పోస్టు ఏర్పాటు చేశారు.
మాకవరపాలెం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఆదేశాల మేరకు వెంకన్నపాలెం వద్ద ఓవర్ లోడుతో వెళుతున్న వాహనాలు తనిఖీ చేసేందుకు తాత్కాలిక చెక్పోస్టు ఏర్పాటు చేశారు. సోమవారం బాక్సైట్ ముడి సరుకు తీసుకువస్తున్న లారీలను ఆర్డీవో వి.వి.రమణ, సీఐ రేవతమ్మ, ఎస్ఐ దామోదర్నాయుడు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ తాళ్లపాలెం వద్ద ఉన్న వంతెన ప్రమాదంలో ఉండడంతో ఓవర్లోడు వాహనాలను అరికట్టాలనే ఉద్దేశంతోనే చెక్పోస్టు ఏర్పాటు చేశామన్నారు. పయనీర్ కంపెనీకి గంగవరం పోర్టు నుంచి ముడిసరుకును ఆధిక లోడుతో తీసుకురావడంతో తాళ్లపాలెం వంతెన ప్రమాదంలో ఉందన్నారు. ఇప్పటికే ఈ వంతెనను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలించారన్నారు. ఈ నేపపథ్యంలోనే చెక్పోస్టు ఏర్పాటు చేసి ఓవర్ లోడు లారీల బిల్లును తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ చెక్పోస్టు వద్ద ఆర్టీవో, పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. అయితే వెంకన్నపాలెం వద్ద చెక్పోస్టు ఏర్పాటుతో రోలుగుంట నల్లరాయి లారీలు బొడ్డేపల్లి నుంచి అడ్డురోడ్ మీదుగా రాంబిల్లి వెళుతున్నాయి.
Updated Date - Aug 04 , 2025 | 11:38 PM