తొలి రోజు 95.32 శాతం పింఛన్ల పంపిణీ
ABN, Publish Date - May 01 , 2025 | 11:05 PM
జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజు గురువారం 95.32 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందించారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో మొత్తం 1,22,403 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.51 కోట్ల 48 లక్షల 66 వేల 500 విడుదలైంది.
జిల్లాలో మొత్తం 1,22,403 మందికి గానూ 1,16,676 మందికి అందజేత
పాడేరు, మే 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజు గురువారం 95.32 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందించారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో మొత్తం 1,22,403 మంది పెన్షన్ లబ్ధిదారులకు రూ.51 కోట్ల 48 లక్షల 66 వేల 500 విడుదలైంది. తొలి రోజు గురువారం రాత్రి 8 గంటల సమయానికి 1,16,676 మందికి రూ.48 కోట్ల 97 లక్షల 74వేల 500 పెన్షన్ల సొమ్మును అందించారు. ఇంకా 5,736 మందికి పెన్షన్ సొమ్ము అందించాల్సి ఉంది. దీంతో జిల్లాలో తొలి రోజు పెన్షన్ల పంపిణీ 95.32 శాతంగా నమోదైంది. తొలి రోజు పెన్షన్ పొందని లబ్ధిదారులకు శుక్రవారం అందజేస్తామని అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్కుమార్ డీఆర్డీఏ పీడీ వి.మురళితో కలిసి పెదబయలు మండలం వనబంగి పంచాయతీ జడిగుడ గ్రామంలో పలువురు లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే అనంతగిరి మండలం చిలకలగెడ్డ గ్రామంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్కుమార్, పాడేరు మండలం వంతాడపల్లిలో టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు.
Updated Date - May 01 , 2025 | 11:05 PM